యంగ్ టైగ‌ర్‌కే కోపం తెప్పించారుగా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు నంద‌మూరి ఫ్యాన్స్‌లో భారీ క్రేజ్ వున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ క‌నిపించినా, ఆయ‌న ఫంక్ష‌న్ వుంద‌న్నా భారీ సంఖ్య‌లో అభిమానులు ఎక్క‌డెక్క‌డి నుంచో త‌ర‌లి వస్తుంటారు. `బాద్‌షా` ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ సంద‌ర్భంగా భారీగా అభిమానులు త‌ర‌లిరావ‌డంతో అక్క‌డ తొక్కిస‌లాట జ‌రిగి వ‌రంగ‌ల్‌కు చెందిన ఓ అభిమాని చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ అలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కూడ‌ద‌ని అప్ప‌టి నుంచి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు ఎన్టీఆర్‌.

అభిమానులంటే అంత కేర్ తీసుకునే ఎన్టీఆర్‌కు బుధ‌వారం కోపం రావ‌డం, అస‌హ‌నానికి గురికావ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం `ఎంత మంచి వాడ‌వురా!`. వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆదిత్య ఉమేష్ గుప్త తొలిసారి నిర్మాత‌గా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 15న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరుపులు ఆప‌క‌పోవ‌డంతో కొంత అస‌హ‌నానికి గుర‌య్యారు.

ఒక ద‌శ‌లో అరుపులు, తోపులాట స్టేజ్ ముందే జ‌రుగుతుండ‌టంతో బ్ర‌ద‌ర్స్‌ సైలెంట్‌గా వుంటేనే మాట్లాడ‌తా లేదంటే ఇక్క‌డి నుంచి వెళ్లిపోతాను అని రెండు సార్లు చెప్పిన త‌రువాతే ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. ఆ త‌రువాతే ఎన్టీఆర్ మాట్లాడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.