మ‌హేష్ హిమాల‌యాల‌కు వెళుతున్నాడా?

సంక్రాంతికి `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో శుభారంభాన్నిచ్చిన మ‌హేష్ ఆ త‌రువాత ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్ కోసం ఆమెరికా చెక్కేసిన విష‌యం తెలిసిందే. వ‌చ్చిన త‌రువాత వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాన‌ని మ‌హేష్ మీడియా ముఖంగా ప్ర‌క‌టించాడు. అయితే స‌మీక‌ర‌ణాల‌న్నీ మారిపోవ‌డం, వంశీ పైడిప‌ల్లి చెప్పిన స్టోరీ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ సినిమాని ప‌క్క‌న పెట్టిన మ‌హేష్ ఆ స్థానంలో ప‌ర‌శురామ్ క‌థ‌ని ఓకే చెప్పడం చ‌క చ‌కా జ‌రిగిపోయాయి.

మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించాల‌నుకున్న ఈ సినిమాని ఈ నెల 15న లాంఛ‌నంగా ప్రారంభిస్తార‌ని, ఉగాది నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌కి వెళ‌తార‌ని ప్ర‌చారం మొద‌లైంది. ఇదిలా వుంటే మ‌హేష్ హియాల‌యాల‌కు వెళుతున్నార‌ట‌. ఎప్పుడూ లేనిది హిమాల‌యాల‌కు వెళ్ల‌డం ఏంట‌ని అంతా అవాక్క‌వుతున్నారు. ర‌జ‌నీ క‌దా వెళ్లేది మ‌హేష్ ఎందుకు వెళుతున్న‌ట్టు అని ఆరాతీస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది.

మ‌హేష్ గ‌త కొంత కాలంగా వ‌రుస షూటింగ్‌ల‌తో రెస్ట్ లేకుండా గ‌డిపేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. దాంతో శారీర‌కంగా, మాన‌సికంగా బాగా ట్రెస్‌ని ఫీల‌య్యార‌ట‌. దాన్ని అధిగ‌మించ‌డం కోస‌మే హియాల‌చాల్లో ట్రెస్ థెర‌పీ చేయించుకోబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఫ్రీ అయి వ‌చ్చిన త‌రువాతే ప‌ర‌శురామ్ చిత్రాన్ని మొద‌లుపెడ‌తార‌ట‌.