మ‌హేష్‌పై అది వ‌ట్టి రూమ‌రేన‌ట!

మ‌హేష్‌పై అది వ‌ట్టి రూమ‌రేన‌ట!

టాలీవుడ్‌లో డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ల పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఇప్ప‌టికే గీతాఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ `ఆహా` పేరుతో మైహోమ్ రామేశ్వ‌ర‌రావుతో క‌లిసి ప్రారంభించ‌డంతో దిల్ రాజు, సురేష్ బాబు వంటి వారు కూడా సొంతంగా ఓటీటీల‌ని మొద‌లుపెడ‌తార‌ని, ఇందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నార‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లు షికారు చేస్తున్నాయి.

తాజాగా ఈ జాబితాలోని స్టార్ హీరో మ‌హేష్ కూడా చేర‌బోతున్నారంటూ వార్త‌లు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్స్ రంగంలోకి ఎంట‌రైన మ‌హేష్ త్వ‌ర‌లోనే సొంతంగా డిజిట‌ల్ ఓటీటీని ప్రారంభించ‌బోతున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది. అయితే ఈ ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌ని, అది గాలి వార్తే న‌న‌టి మ‌హేష్ వ‌ర్గం వివ‌ర‌ణ ఇచ్చింది.

మ‌హేష్ దృష్టంతా త‌న నెక్ట్ ప్రాజెక్ట్ పైనే వుంద‌ని, ప‌ర‌శురామ్‌తో చేయ‌బోతున్న చిత్రం జూన్ నుంచి సెట్స్ పైకి వెళుతుంద‌ని మ‌హేష్ టీమ్ వెల్ల‌డించిన‌ట్టు ఇన్ సైడ్ టాక్‌.