మ‌హేష్‌తో రాజ‌మౌళి పాన్ ఇండియా సినిమా

మ‌హేష్‌తో రాజ‌మౌళి పాన్ ఇండియా సినిమా

`బాహుబ‌లి` త‌రువాత రాజ‌మౌళి స్థాయి మారింది. పాన్ ఇండియా స్థాయి డైరెక్ట‌ర్‌గా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న నుంచి సినిమా వ‌స్తోందంటే యావ‌త్ దేశం మొత్తం ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్న ప‌రిస్థితి. ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తున్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇందులో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీంగా నిస్తున్న విష‌యం తెలిసిందే. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మ‌రో కీల‌క షెడ్యూల్ పూనేలో ప్రారంభం కావాల్సి వుంది. ఈ లోగా క‌రోనా ఎఫెక్ట్ ఆరంభం కావ‌డంతో షూటింగ్‌ని వాయిదా వేశారు. ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత రాజ‌మౌళి ఏ హీరోతో సినిమా చేస్తారు?. ఆ నిర్మాత ఎవ‌రు? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

తాజాగా ఈ చ‌ర్చ‌పై రాజ‌మౌళి స్పందించారు. `ఆర్ఆర్ఆర్` త‌రువాత ప్ర‌భాస్‌తో లేదా మ‌హేష్‌తో సినిమా చేస్తార‌ని జోరుగా వార్లు వినిపిస్తున్నాయి. ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని చెప్పిన రాజ‌మౌళి త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాత్రం మ‌హేష్‌తో చేస్తాన‌ని. ఇది ఎప్ప‌టి నుంచో అనుకుంటున్న‌దేన‌ని, దీనికి దుర్గా ఆర్ట్స్ అధినే‌త కె.ఎల్‌. నారాయ‌ణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని స్ప‌ష్ం చేశారు. అయితే ఇది ఏ జోన‌ర్‌లో వుంటుంది? ఎంత బ‌డ్జెట్‌తో వుంటుంది అన్న విష‌యాల్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు.