‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ విజయ్ దేవరకొండ వీడియో

‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్న విజయ్ దేవరకొండ

మొత్తానికి అనుకున్నట్లుగానే విజయ్ దేవరకొండ నిర్మాత అయ్యారు. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తరుణ్ భాస్కర్, అనసూయ లాంటి తారలతో సినిమాను ప్రారంభించారు. ప్రారంభానికి ముందు జరిగిన మాటల వీడియోను షేర్ చేసి ఆ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్‌ను ప్రకటించారు.

పెళ్లి చూపులు సినిమాతో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌ కు మంచి గుర్తింపు వచ్చింది. పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత వేరే ఏ సినిమాను మొదలు పెట్టలేదు తరుణ్. ఇప్పుడిలా హీరోగా ప్రకటన వచ్చిందన్నమాట.

King of the Hill Title Announcement - Meeku Maathrame Cheptha

ఈ వీడియోలో తరుణ్ భాస్కర్ గల్లీ క్రికెట్ ఆడుతుంటే.. విజయ్ దేవరకొండ ఫోన్ చేసి.. ఇప్పుడే కథ విన్నాను. ఆ సినిమాకు నేనే నిర్మాతగా ఉండాలనుకొంటున్నాను అంటే.. అందుకు తరుణ్ భాస్కర్ సమాధానం ఇస్తూ.. మంచి సినిమాలు తీయి.. ఇంతకు హీరో ఎవరు అంటే.. నీవే అంటూ ఝలక్ ఇవ్వటం గమనించవచ్చు.