మాస్ రాజా కోసం ఆ ఇద్ద‌రు రెడీ?

మాస్ రాజా కోసం ఆ ఇద్ద‌రు రెడీ?

మాస్ రాజా ర‌వితేజ.. ఫ్లాపులు, హిట్‌ల‌తో సంబంధం లేకుండా వ‌రుస చిత్రాల్ని ద‌క్కించుకుంటున్నారు.
పారితోషికం త‌గ్గించినా ఆఫ‌ర్లు మాత్రం బాగానే వున్నాయి. `డిస్కోరాజా` ఫేటు మారుస్తంద‌ని న‌మ్మితే భారీ ఫ్లాప్‌ని అందించింది. అయినా ర‌వితేజ ఎక్క‌డా త‌గ్గ‌డంలేదు. ఫ్లాపుల్లో వున్నా స‌రే వ‌రుస ఆఫ‌ర్ల‌తో క‌ళ‌క‌ల‌లాడిపోతున్నాడు.

ప్ర‌స్తుతం ర‌మేష్ వ‌ర్మ‌తో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో ఓ సినిమాకు క‌మిట్ అయిన మాస్ రాజా క‌న్ను రీమేక్ చిత్రంపై ప‌డిన‌ట్టు తెలుస్తోంది. మ‌ల‌యాళంలో పృథ్విరాజ్ సుకుమార‌న్‌, బీజూ మీన‌న్ క‌లిసి న‌టించిన చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌`. ఈ చిత్ర రీమేక్ హ‌క్కుల్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రానా, బాల‌కృష్ణ క‌లిసి చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

అయితే తాజాగా ఈ చిత్రాన్ని ర‌వితేజ చేయ‌బోతున్న‌ట్టు తెలిసింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో పాటు ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ కూడా నిర్మించ‌నుంద‌ట‌. సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ట‌. ‌