మహేష్ తో ప్రత్యేక గీతంలో నర్తించనున్న పూజా హెగ్డే

మహేష్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ చిత్రంలో మహేష్ ఒక మేజర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ప్రేక్షకులకు వినోదం కూడా సమానంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడట అనిల్.

ఇందులో ఒక ప్రత్యేక గీతంలో మహేష్ సరసన నర్తించడానికి చాలా మంది పేర్లు పరిశీలనలో ఉండగా పూజా హెగ్డే ఖరారు అయిందని సమాచారం. ఈమె ఇప్పటికే ‘మహర్షి’ సినిమాలో మహేష్ సరసన నటించగా పెద్ద హీరోల అందరి సరసన వరుసపెట్టి అవకాశాలు రావడం ఈమె అదృష్టమని చెప్పాలి.

ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా విజయశాంతి, ప్రకాష్ రాజ్, స్నేహ మొదలైన వారు ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.