బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన నాగార్జున

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన నాగ్‌

ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. రాత్రికి రాత్రే స్టార్‌లు అయిపోవ‌చ్చు..అదే రాత్రి బికార్లుగా కూడా మారిపోవ‌చ్చు. ఒకరితో అనుకున్న సినిమా ఒక్క క్ష‌ణంలోనే చేతులు మారొచ్చు.. మ‌రొక‌రి చేతికి చేరొచ్చు. ఇక్క‌డ ఏదీ అసాధ్యం అనేది లేదు. అలా అని ఏదీ అంతా ఈజీగా సాధ్యం కాదు. స‌క్సెస్ చుట్టూ తిరిగే ఈ వైకుంఠ‌పాళి ఆట‌లో ఎవ‌రు పావులుగా మార‌తారో ఎవ‌రు కింగ్ అవుతారో చెప్ప‌డం క‌ష్టం.

అయితే ఈ ఆట హ‌ద్దులు దాటితేనే ప్ర‌మాదం.. అదే ప్ర‌మాదం ఇప్పుడు ఓ యంగ్ డైరెక్ట‌ర్‌ని హీరో నాగార్జున బ్లాక్ లిస్ట్‌లో పెట్టేలా చేసింది. నాగార్జున‌కే మండేలా చేసిన ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు ప‌ర‌శురామ్‌. `గీత గోవిందం` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో ప‌ర‌శురామ్ క్రేజ్ పెరిగింది. బ‌న్నీతో ఎలాగైనా సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకుని గీతా ఆర్ట్స్‌లోనే వుండిపోయాడు. ఎంత‌కీ బ‌న్నీ నుంచి సిగ్న‌ల్ రాక‌పోవ‌డంతో చేసేది లేక ఇంకా ఖాలీగా వుండ‌లేక నాగ‌చైత‌న్య‌కు స్టోరీ చెప్పాడు.

ఓకే అనిపించుకున్నాడు. 14 రీల్స్ ప్ల‌స్ ఆ సినిమాని నిర్మించ‌డానికి ముందుకొచ్చాయి. అంతా ఓకే అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. కానీ డామిట్ క‌థ అడ్డం తిరిగింది. ప‌ర‌శురామ్‌కు మ‌హేష్ని డైరెక్ట్ చేయాల‌ని డ్రీమ్. ఆ విష‌యాన్ని మాటల సంద‌ర్భంలో కొర‌టాల‌కు చెప్పాడ‌ట‌. ఇంకే ముందు విష‌యం మ‌హేష్ దాకా వెళ్లింది. క‌ట్ చేస్తే ప‌ర‌శురామ్‌ని క‌థ చెప్ప‌మ‌ని క‌బురు పెట్టాడు. ఆగ‌మేఘాల మీద వెళ్లి క‌థ చెప్పాడు.. మ‌హేష్‌కు న‌చ్చింది. మ‌నం సినిమా చేస్తున్నాం పూర్తి స్క్రిప్ట్‌తో రా అన్నాడు. ఊహించ‌ని అవ‌కాశం రావ‌డంతో నాగ‌చైత‌న్య ప్రాజెక్ట్‌ని ప‌రశురామ్ ప‌క్క‌న పెట్టాడు మ‌హేష్ సినిమాని ఫైన‌ల్ చేశాడు. ఇక్క‌డే నాగ్‌కు మండింది. త‌న కొడుకుని కాద‌ని ప‌ర‌శురామ్.. మ‌హేష్ సినిమాకి వెళ్లిపోవ‌డం హ‌ర్ట్ చేసింది. ఫ‌లితంగా భవిష్య‌త్తులో త‌న‌తో కానీ, త‌న త‌న‌యుల‌తో కానీ ప‌ర‌శురామ్ సినిమా చేయ‌కూడ‌ద‌ని నాగ్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశాడ‌ట‌. ప్ర‌స్తుతం ఇది ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.