ప‌వ‌న్ చేతిపై టాటూ స్టోరీ చెప్పేసింది!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాంచి జోరుమీదున్నారు. గ‌తంలో ఏడాదికి ఒక సినిమా మాత్ర‌మే చేస్తూ వ‌చ్చిన ప‌వ‌న్ లాజాగా గేరు మార్చారు. ఎన్న‌డూ లేని విధంగా వ‌రుసగా ప్రాజెక్ట్‌ల‌ని మొద‌లుపెట్టేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు సెట్స్‌పై వుండ‌గా మ‌రో మూడు త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్నాయి. `పింక్‌` రీమేక్‌తో వ‌రుస సినిమాల్ని మొద‌లుపెట్టిన ఆయన త‌న 27వ చిత్రాన్ని క్రిష్‌తో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇదొక పిరియాడిక్ చిత్ర‌మ‌ని, పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ని ఇప్ప‌టికే వార్తలు షికారు చేస్తున్నాయి.

అయితే తాజాగా గ‌డ్డం తీసేసి క్లిన్ షేవ్‌తో క‌నిపిస్తున్న ప‌వ‌న్ ఇటీవ‌ల త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో ఓ మీటింగ్‌ని నిర్వ‌హించారు. దీనిక ఇసంబంధించిన కొన్ని ఫొటోల్ని పీఆర్ టీమ్ విడుద‌ల చేసింది. అలా వ‌చ్చిన ఫొటోల్లో ప‌వ‌న్ రైట్ హ్యాంగ్ మ‌ణి క‌ట్టుకి కింది భాగంలో ఓ టాటూ క‌నిపిస్తోంది. అది మొగ‌లాయిల కాలం నాటి మెగ‌ల్ సామ్రాజ్య‌పు సింబ‌ల్‌. దీన్ని బ‌ట్టే ప‌వ‌న్ ఒక‌ప్ప‌టి బందిపోటు దొంగ తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగ‌ల సాయ‌న్నగా క‌నిపించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. దీన్ని ఓ ఫిక్ష‌న‌ల్‌గా క్రిష్ తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా ప‌లువురిని ప‌రిశీలించిన క్రిష్ బాలీవుడ్ భామ వాణీ క‌పూర్‌ని తీసుకుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌.

నాని న‌టించిన `ఆహా క‌ల్యాణం`తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది వాణీక‌పూర్‌. అయితే తొలి సినిమా ఫ్లాప్ కావ‌డంతో తెలుగులో మ‌రో సినిమాలో క‌నిపించ‌లేదు. మ‌ళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇక మ‌రో హీరోయిన్‌గా ప్ర‌గ్యా జైస్వాల్ క‌నిపించ‌బోతోంద‌ని, ఇప్ప‌టికే క్రిష్ ఆమెకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు చిత్ర వర్గాల స‌మాచారం.