పాన్ ఇండియా అయినా పూరీ స్పీడు మార‌లేదే!

టాలీవుడ్‌లో రాకెట్ వేగంతో సినిమాలు చేయ‌డంతో డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరిగన్నాథ్ స్టైల్ ప్రత్యేకం. ఈ విష‌యంలో పూరీకి ఇండ‌స్ట్రీలో మంచి పేరుంది. అయితే `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చిన పూరి త‌న త‌దుప‌రి చిత్రాన్ని రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేస్తున్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయి సినిమా కావ‌డంతో ఈ చిత్రానికి పూరీ త‌న మార్కు స్పీడుని ప‌క్క‌న పెట్టి సాఫీగా షూటింగ్ చేస్తాడ‌ని అంతా ఊహించారు.

అయితే పూరి మాత్రం త‌న స్కూల్లోనే మెరుపు వేగంతో సినిమాని పూర్తి చేస్తున్నాడు. ఇటీవ‌ల ముంబైలో మొద‌లైన ఈ మూవీ షూటింగ్ రాత్రీ ప‌గ‌లూ అని తేడా లేకుండా ముంబై రోడ్ల‌పై షూటింగ్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌లో 40 రోజుల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి షాకిచ్చాడు. ఈ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించిన‌ట్టు చిత్ర బృందం తెలిపింది. ఇందులో రెండు భారీ యాక్ష‌న్ ఘ‌ట్టాలున్నాయ‌ట‌. అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పూరిజ‌గ‌న్నాథ్‌, చార్మితో క‌లిసి క‌రణ్ జోహార్, అపూర్వ మెహ‌తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.