న‌రేష్ సినిమాకు ఇవీవీ క‌థ‌?

అల్ల‌రి న‌రేష్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఒక‌టి `బంగారు బుల్లోడు`, మ‌రొక‌టి `నాంది`. ఈ రెండు చిత్రాల త‌రువాత అల్ల‌రి న‌రేష్ మ‌రో చిత్రాన్ని కూడా ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. గ‌తంలో ఏడాదికి క్ష‌ణం తీరిక లేకుండా వ‌రుస చిత్రాల్లో న‌టించిన అల్ల‌రి న‌రేష్ గ‌త కొంత కాలంగా సినిమాలు లేకండా ఖాలీగా వున్నారు. ఏ సినిమా చేయాలి?. ప్రేక్ష‌కుల‌కు ఏది చేస్తే న‌చ్చుతుంది?. ఏ జోన‌ర్ చేస్తే న‌చ్చుతుంది? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌తో సందిగ్ధంలో ప‌డిపోయారు.

చివ‌రికి త‌న మార్కు కామెడీ సినిమా ఒక‌టి ( బంగారు బుల్లోడు), మ‌రొక‌టి కొత్త త‌ర‌హా సినిమా (నాంది) చేస్తున్నారు. ఈ రెండింటితో పాటు సొంత నిర్మాణ సంస్థ‌లో కొత్త సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఈవీవీ బ్రతికి వున్న కాలంలో అల్ల‌రి న‌రేష్ కోసం ఓ క‌థ‌ని సిద్ధం చేశార‌ట‌. అదే క‌థ‌ని అల్ల‌రి న‌రేష్ త్వ‌ర‌లో తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ని తెలిసింది. ఈ చిత్రాన్ని సొంత నిర్మాణ సంస్థ ఈవీవీ సినిమా బ్యాన‌ర్‌లో చేయ‌బోతున్నాడ‌ని తెలిసింది.

ఇది ఇవీవీ స‌త్య‌నారాయ‌ణ రూపొందించిన ఓ హిట్ చిత్రానికి సీక్వెల్ అని తెలిసింది. అయితే అది ఏ
ఏ సినిమాకు సీక్వెల్ అనేది మాత్ర్ ఇంకా క్లారిటీ లేదు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ని తెలిసింది.