నాగార్జునకు గోపిచంద్ మలినేని హిట్ ఇస్తాడా?

కింగ్ నాగార్జునకు ప్రస్తుతం కాలం కలిసి రావట్లేదని చెప్పాలి. వరుస ప్లాప్లు ఇస్తూ కెరీర్ ఇరకాటంలో పెట్టుకున్నాడు. ఇక తాజాగా విడుదల అయిన ‘మన్మధుడు 2 ‘ సినిమా నుంచి ఆయన ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.

ఈ క్రమంలో తదుపరి సినిమాతో మంచి విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు నాగ్. తన తదుపరి సినిమా గోపీచంద్ మలినేనితో చేస్తున్నట్టు తెలిసింది.

దర్శకుడు గోపీచంద్ మలినేని రవి తేజతో ‘బలుపు’ సాయి తేజ్ తో ‘విన్నర్’ చేసాడు. తన ‘విన్నర్’ సినిమా ప్లాప్ అయ్యాక రెండేళ్లుగా ఏ సినిమా చేసే అవకాశం రాలేదు. అలాంటిది ఇప్పుడు నాగ్ ప్రాజెక్ట్ కుదిరిందంటే ఎలాంటి కథ చూపి నాగ్ ను ఒప్పించాడో అనుకుంటున్నారు సినీ జనాలు.

ఏది ఏమైనా ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.