నంద‌మూరి ఫ్యాన్స్ ఉత్కంఠ‌కు తెర‌ప‌డేనా?

సందీప్‌రెడ్డి వంగ మొద‌లుపెట్టిన ‌`బీ ద రియ‌ల్ మెన్‌` ఛాలెంజ్ ‌టాలీవుడ్‌లో వైర‌ల్‌గా మారుతోంది. ఒక్కో సెల‌బ్రిటీ ఇంటి ప‌ని చేస్తూ వంటి ప‌ని చేస్తూ ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఛాలెంజ్‌ని మ‌రొక‌రిని నామినేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ని రాజ‌మౌళి నామినేట్ చేస్తే ఎన్టీఆర్ త‌నకిచ్చిన టాస్క్‌ని పూర్తి చేసి ఏకంగా సీనియ‌ర్ల‌ని బ‌రిలోకి రావాల‌ని నామినేట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున, వెంక‌టేష్‌ల‌ని ఎన్టీఆర్ నామినేట్ చేయ‌డంతో ఈ ఛాలెంజ్ ర‌స‌ప‌ట్టుగా సాగుతోంది. గురువారం ఎన్టీఆర్ చాలెంజ్‌ని స్వీక‌రించి చిరు త‌న‌కు తోచిన ప‌నులు చేసి టాస్క్‌ని కంప్లీట్ చేశారు. ఆ త‌రువాత ఈ ఛాలెంజ్‌ని కంప్లీట్ చేసిన వెంక‌టేష్ కంప్లీట్ చేసి మ‌హేష్‌ని, వ‌రుణ్‌తేజ్‌ని, అనిల్ రావిపూడిని నామినేట్ చేశారు.

ఎన్టీఆర్ నామినేట్ చేసిన వారిలో మిగిలింది ఇద్ద‌రు బాల‌కృష్ణ‌, నాగార్జున‌. ఈ ఇద్ద‌రిలో బాల‌కృష్ణ ఈ ఛాలెంజ్‌ని పూర్తి చేయ‌డం ఇప్పుడు నంద‌మూరి ఫ్యాన్స్‌లో ఉత్కంఠ‌గా మారింది. గ‌త కొంత కాలంగా ఎన్టీఆర్‌, బాల‌య్య మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ప్ర‌చారం త‌ప్ప‌ని తేలాలంటే బాలయ్య `బీ ద రియ‌ల్ మెన్` ఛాలెంజ్‌ని పూర్తి చేయాల్సిందే. ఇదే ఇప్పుడు నంద‌మూరి ఫ్యాన్స్‌లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. శుక్ర‌వారం బాల‌య్య నుంచి రిప్లై రాలేదంటే బ‌య‌ట జ‌రుగుతున్న ప్ర‌చార‌మే నిజ‌మ‌ని తేలిపోతుంది.