`దండుపాళ్యం` దర్శకుడితో సుమంత్ అశ్విన్‌!

ఎం.ఎస్‌. రాజు నిర్మాత‌గా గ‌త కొంత కాలంగా గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. అదే స్థాయిలో ఆయ‌న త‌న‌యుడు సుమంత్ అశ్విన్ కెరియ‌ర్ కూడా ఏమంత బాగా లేదు. `ప్రేమ‌క‌థా చిత్రమ్‌2` త‌రువాత కొంత విరామం తీసుకున్న సుమంత్ అశ్విన్ వ‌రుస‌గా సినిమాలు అంగీక‌రిస్తున్నారు. ఇటీవ‌లే ఓ సినిమా మొద‌లైంది. తాజాగా మ‌రో చిత్రం సైలెంట్‌గా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

దీనికి `దండు పాళ్యం` ఫేం శ్రీ‌నివాస‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి `18 + సినిమా` అనే పేరుని ఖ‌రారు చేశారు. ఇప్ప‌టికే కొంత భాంగ షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమా చివ‌రి షెట్యూల్ ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త‌మిళ‌నాడులోని తిరువ‌ల్లావూరులో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో జ‌రుగుతోంది. దీంతో సినిమా పూర్త‌వుతుంద‌ట‌. స‌మ్మ‌ర్‌కు చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస‌రాజు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి ఈ సినిమా అయినా సుమంత్ అశ్విన్‌కి హిట్‌ని అందించేనా?