త్రిష ఆశలన్నీ ‘రాంగీ’ పైనే!

Trisha in Raangi

ఒకప్పుడు తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించిన అందాలతార త్రిష ఇప్పుడు కనుమరుగనే చెప్పాలి. ఆమె ఇది వరకు నటించిన ‘నాయకి’, ‘మోహిని’ వంటి చిత్రాలు ప్లాప్ అవ్వడంతో పూర్తిగా కనిపించడం మానేసింది. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలే మరో మూడు త్రిష చేతిలో ఉన్నాయి. వాటిలో ‘పరమపదం విళైయాట్టు’, ‘గర్జన’ చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతున్నాయి.

తాజాగా ‘రాంగీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంపై త్రిష ఎన్నో ఆశలు పెట్టుకుందట. కారణం దీనికి కథ, మాటలను ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ అందించడమే. ఆయన శిష్యుడు శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘రాంగీ’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.ఇది పూర్తి యాక్షన్‌ ఓరియంటెడ్ కథా చిత్రం. పోరాట సన్నివేశాల్లో త్రిష డూప్‌ లేకుండా నటించేస్తోందట. ’రాంగీ’ చిత్రాన్ని సెప్టెంబరు నెలలో తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతుండటంతో త్రిష ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.ఆమె ఆశలు ఫలించాలని కోరుకుందాం!