త్రిష మళ్లీ మంచి రోజులు!

త్రిషకు ’96’ చిత్రంతో మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ’96’ అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తరువాత రజనీకాంత్‌తో నటించాలన్న తన చిరకాల కోరిక ‘పేట’ చిత్రంతో నెరవేరింది. ఈ రెండు చిత్రాల హిట్‌తో త్రిష పేరు మరోసారి ఫోకస్ లోకి వచ్చింది.
 
ఆమె నటించిన మూడు నాలుగు చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. 2020 త్రిష మరోసారి ఓ ఊపు ఊపే అవకాశం కనిపిస్తోంది . త్రిష గతంలో నటిగా కోలీవుడ్‌లో వెలిగిపోతూనే, తెలుగులోనూ పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించింది. అయితే ఎవరికైనా జీవితంలో గానీ, వృత్తిలో గానీ వడిదుడుకులు సాధారణం. అందుకు త్రిష అతీతం కాదు. నటిగా వరుస ఫ్లాప్‌లతో సతమతం అయ్యింది.పలు చేదు అనుభవాలను చవిచూసింది.
 
త్రిష కథానాయికగా తెరకెక్కుతున్న తాజా తమిళ చిత్రం ‘రాంగి’. విదేశీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతున్నది. ఇందులో మొండితనం, ధైర్యసాహసాలున్న యువతిగా త్రిష కనిపిస్తుంది. పోలీస్ అధికారిణిగా, ఖైదీగా భిన్న పార్శాల్లో ఆమె పాత్ర నడుస్తుంది. ఈ సినిమా కోసం బైక్‌రైడింగ్‌తో పాటు యుద్ధవిద్యల్లో త్రిష శిక్షణ తీసుకుందని, డూప్‌లు లేకుండా… ఆమెపై తెరకెక్కించిన పోరాట సన్నివేశాలు అలరిస్తాయట.  
 
త్రిష గతేడాది ‘హే జూడ్‌’ చిత్రంతో మలయాళంలో తొలి సినిమా చేసింది. ఈ సినిమాలో త్రిష నటనకు అక్కడ మంచి మార్కులే పడ్డాయి. మోహన్‌లాల్‌ హీరోగా జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రామ్‌’ అనే చిత్రంలో త్రిషను కథానాయికగా తీసుకున్నారు. ఇందులో మోహన్‌లాల్‌ చేస్తున్న రామ్‌ పాత్రకు భార్యగా త్రిష కనిపిస్తుంది.
 
Trisha is currently acting in Raangi. It is believed that her character in Raangi is going to bring back stardom to Trisha.