జూ.ఎన్టీఆర్ తో ఎఫైర్ పై ఓపెనైన బ్యూటీ

జూ.ఎన్టీఆర్ తో ఎఫైర్ పై ఓపెనైన బ్యూటీ

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే ఓ అందాల క‌థానాయిక‌తో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని ప్ర‌చార‌మైన సంగ‌తి తెలిసిందే. తొంద‌ర్లోనే ఆ బ్యూటీని పెళ్లాడేందుకు తార‌క్ సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని ఫ్యాన్స్ లో విప‌రీత‌మైన చ‌ర్చ సాగింది. అయితే త‌న‌పై వ‌చ్చిన ఈ రూమ‌ర్స్ పై తార‌క్ ప‌దే ప‌దే ఎంతో ఆవేద‌న‌కు గుర‌య్యేవాడు. ఆ రూమ‌ర్లు కేవ‌లం ఎన్టీఆర్ ని మాత్ర‌మేనా.. ఆ అమ్మ‌డిని కూడా ఎంత‌గానో వేధించాయి. ఇంత‌కీ ఆవిడెవ‌రో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. ముంబై ప‌రిశ్ర‌మ‌లో సెటిలైన‌ తెలుగ‌మ్మాయి స‌మీరారెడ్డి గురించే.

ఎన్టీఆర్ స‌ర‌స‌న వ‌రుస చిత్రాల్లో న‌టించింది స‌మీరా రెడ్డి. అశోక్ – న‌ర‌సింహుడు లాంటి చిత్రాల్లో న‌టించిన క్ర‌మంలోనే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సాన్నిహిత్యం కుదిరింది. ఆ సాన్నిహిత్యాన్ని ప్రేమ అంటూ ప్ర‌చారం సాగించేయ‌డంతో అది కాస్తా స‌మీరా రెడ్డిని ఇర‌కాటంలో పెట్టేసింది. తొంద‌ర్లోనే ఎన్టీఆర్ ని పెళ్లాడేయ‌నుంద‌న్న ప్ర‌చారం సాగ‌డంతో ఇక ఆఫ‌ర్లు కూడా త‌గ్గిపోయాయి. త‌న‌ని బ‌య‌ట అంతా ఎన్టీఆర్ ప్రేయ‌సిగానే చూసేవారట‌. దాంతో ర‌క‌ర‌కాల ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని స‌మీరా రెడ్డి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఒక ర‌కంగా ఎన్టీఆర్ తో ఎఫైర్ వార్త‌లు త‌న కెరీర్ కి ఇబ్బందులు క‌లిగించాయ‌ని స‌మీరా తెలిపింది.

తార‌క్ నేను స్నేహితులం మాత్ర‌మే. ఆన్ లొకేష‌న్ షూటింగ్ అయిపోయాక స్నేహితులుగానే ఉండేవాళ్లం. త‌న నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నాను అని స‌మీరా ప‌లు ఇంట‌ర్వ్యూల్లో తెలిపింది. ఇక స‌మీరారెడ్డితో ఎఫైర్ విష‌యాన్ని ఓ ప్ర‌ముఖ చానెల్ యాజ‌మాని ఓ కార్య‌క్ర‌మంలో తార‌క్ నే ప్ర‌శ్నిస్తే.. చిలిపిగా న‌వ్వేసిన యంగ్ య‌మ భ‌లే ఆస‌క్తిక‌ర‌మైన ఆన్స‌ర్ ఇచ్చాడు. “ఆ వ‌య‌సులో ఏదో తెలియ‌క‌.. అలా అలా..!“ అంటూ ముసిముసిగా న‌వ్వేసి ఫ్యాన్స్ ముఖాల్లో క్వ‌శ్చ‌న్ మార్క్ ని అలానే ఉంచేశాడు. ఇక్క‌డో ట్విస్టేమిటంటే.. స‌ద‌రు చానెల్ ఓన‌ర్ త‌న గారాల‌ కుమార్తెను ఎన్టీఆర్ కి క‌ట్ట‌బెట్టేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడన్న ప్ర‌చారం అప్ప‌ట్లో సాగింది. తార‌క్ లాంటి ఛ‌రిష్మా ఉన్న స్టార్ ని అల్లుడిని చేసుకోవాల‌ని త‌న టీవీ చానెల్ బ్రాండ్ వ్యాల్యూ పెంచాల‌ని.. మీడియాని మ‌రింత విస్త‌రించాల‌ని క‌ల‌లు క‌‌న్నాడు. కానీ అనూహ్యంగా సీన్ రివ‌ర్స‌య్యింది.

ర‌క‌ర‌కాల రాజ‌కీయ ప‌రిణామాల అనంత‌రం ఎన్టీఆర్ కి పిల్ల‌ను వెత‌క‌డంలో మామ చంద్ర‌బాబు ఇన్వాల్వ్ మెంట్ తో మీడియా ఓన‌ర్ ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాపైంది. కార‌ణం ఏదైనా.. సద‌రు ఛానెల్ ఓన‌ర్ క‌ల నెర‌వేర‌లేదు. దీనిపై తెలుగు వారిలో నిరంత‌రం ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతూనే ఉంటుంది ఇప్ప‌టికీ. ఇందులో ఇంకో ట్విస్టేమిటంటే .. స‌మీరారెడ్డి తో ఎఫైర్ గురించి `మామ గారు` కావాల‌నుకున్న స‌ద‌రు చానెల్ ఓన‌రే తార‌క్ ని ఆ డిబేట్ లో నిల‌దీసే ప్ర‌య‌త్నం చేశాడు. దానికి తార‌క్ సింపుల్ గా న‌వ్వేస్తే ఆ వ‌య‌సులో తెలియ‌క అనేశాడు!! ఆ త‌ర్వాత క‌థంతా తెలిసిందే. తార‌క్ అటుపై నార్నే ఎస్టేట్స్ అధినేత నార్నే శ్రీ‌నివాస‌రావు కుమార్తె ల‌క్ష్మీ ప్ర‌ణ‌తిని పెళ్లాడి నార్నే వారి అల్లుడు అయ్యాడు.