పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్-2 టీజర్, ట్రైలర్ ట్రీట్ ఎప్పుడుంటుందా?అని పాన్ ఇండియా ఫ్యాన్స్ గత కొన్ని నెలలుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులకి డబుల్ కిక్ నిచ్చింది. టీజర్, ట్రైలర్ తో ఆ కిక్ ట్రిపుల్ అవుతుందని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తయింది. ఇక టీజర్ సమ్మర్ కానుకగా విడుదలవుతుందని యూనిట్ ముందుగానే రివీల్ చేసింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సయంలో టీజర్ ట్రీట్ ఖాయమనే భావించారంతా. కానీ తాజాగా ఆ నిర్ణయాన్ని యూనిట్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో టీజర్ రిలీజ్ అవుతుందంటూ జరుగుతోన్న ప్రచారాన్ని క్రియేటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ్ (హోంబలే ప్రతినిధి) కొట్టిపారేసారు. ప్రస్తుతానికి టీమ్ లో దర్శకుడు గానీ, హీరోగానీ అలాంటి ప్రయత్నాలేవి చేయడం లేదని… లాక్ డౌన్ తో దేశం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిన సమయంలో…సినిమాకు సంబంధించిన ఏ కార్యక్రమం చేపట్టబోమని తెలిపారు. సినిమా రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేస్తామని…అప్పటివరకూ ఎవరూ యూనిట్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాదని వెల్లడించారు. దీంతో అభిమానుల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లు అయింది. ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది యూనిట్ క్లారిటీ ఇవ్వని సంగతి తెలిసిందే.
జూలైలో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కాని నేపథ్యంలో ఆ నెలలో కేజీఎఫ్-2 రిలీజ్ అవుతుందని ప్రచారం సాగింది. కానీ అప్పటికీ షూటింగ్ సహా ఇతర పనులేవి పూర్తి కావని యూనిట్ తెలిపింది. అటుపై అక్టోబర్ .. డిసెంబర్ కి వచ్చేస్తారు అంటూ ప్రచారం సాగింది. కానీ ఏదీ యూనిట్ తరపున అధికారికంగా ఖరారు చేయలేదు. ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా 2021లో రిలీజ్ అవుతుందని కొత్త ప్రచారం మొదలైంది. మరి ఈ ప్రచారానికి యూనిట్ ఫుల్ స్టాప్ పెడుతుందా? లేదూ కంటిన్యూ చేస్తుందా? అన్నది చూడాలి.