క్ష‌మించ‌మంటున్న దుల్క‌ర్‌!

క్ష‌మించ‌మంటున్న దుల్క‌ర్‌!

దుల్క‌ర్ స‌ల్మాన్ పేరుకి మ‌ల‌యాళ న‌టుడే అయినా మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. మ‌ణిరత్నం `ఓకే బంగారం`, సావిత్రి జీవిత క‌థ ఆధారంగా రూపొందిన `మ‌హాన‌టి` చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు దుల్క‌ర్ చేరువ‌య్యారు. తాజాగా త‌మిళ డ‌బ్బింగ్ చిత్రం `క‌నులు క‌నుల‌ను దోచాయంటే` చిత్రంతో తెలుగులో మ‌రో హిట్‌ని సొంతం చేసుకున్నాడు.

తెలుగులో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ హీరో త‌న‌ని క్ష మించ‌మ‌ని క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాడు. దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన తాజా మ‌ల‌యాళ‌ చిత్రం `వ‌రానే అవ‌శ్య‌ముడ్‌`. అనూప్ స‌త్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. కీల‌క పాత్ర‌ల్లో హీరో సురేష్ గోపీ, శోభ‌న న‌టించారు.

దుల్క‌ర్ స‌ల్మాన్ నిర్మించిన ఈ చిత్రంలో ముంబైకి చెందిన ఓ జ‌ర్న‌లిస్టు ఫొటోల‌ని ఓ స‌న్నివేశంలో అస‌భ్యంగా చూపించార‌ట‌. బాడీ షేమింగ్‌పై గ‌త కొంత కాలంగా చ‌ర్చ‌న‌డుస్తున్న విష‌యం తెలిసిందే త‌న‌కు తెలియ‌కుండా జ‌రిగిన త‌ప్పిదానికి దుల్క‌ర్ ఓ న‌టుడిగా, నిర్మాత‌గా క్ష‌మాప‌ణ‌లు కోర‌ణం ఆస‌క్తిక‌రంగా మారింది. `వ‌రానే అవ‌శ్య‌ముడ్‌` ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించింది.