క్రిస్మస్ కానుకగా నితిన్ ‘భీష్మ’

తాజాగా నితిన్ కెరీర్ లో వరుస ప్లాప్లు వచ్చి పడుతున్నాయి. అందువల్ల ఇక పై సినిమాలు జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు హీరో నితిన్. ప్రస్తుతం ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల తో చేస్తున్న ‘భీష్మ’ ను క్రిస్మస్ కు విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. హెబ్బా పటేల్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ మరియు నితిన్ మధ్య సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని వాళ్ళు తెర పై నవ్వుల పువ్వులు పండిస్తారని చిత్ర బృందం చెబుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.