కేజీఎఫ్ సీక్వెల్‌పై రవీనా టాండన్‌ అడుగు!

టాలీవుడ్ లో కేజీఎఫ్ చేసిన సెన్సేషన్ తో సీక్వెల్‌పై నేషనల్ ఇండస్ట్రీలో భారీ అంచనాలే నెలకొన్నాయి. కన్నడ హీరో యాష్‌ని ఓ రేంజ్‌లో చూపించి కేజీఎఫ్‌తో సెన్సేషన్ హిట్టందుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్‌కు కొనసాగింపుగా చాప్టర్-2ని తెరకెక్కిస్తుండటం తెలిసిందే. దాదాపు 90శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్‌లోనే సినిమా చూపించేందుకు సౌత్, నేషనల్ ఆర్టిస్టుల్ని భాగం చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

ఇప్పటికే బాలీవుడ్ నుంచి సంజయ్ దత్‌ను ప్రతి నాయకుడిగా ఫస్ట్‌లుక్‌తో పరిచయం చేసిన దర్శకుడు, తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్‌ను పరర్ఫుల్ పాత్రలో చూపించనున్నాడట. ఇందులో రాఖీ భాయ్‌మీద డెత్ వారెంట్ ఇష్యూ చేసే పాత్రలో రవీనా కనిపించనుందని తెలుస్తోంది. తాజాగా ఆమె షూటింగ్‌లో ప్రవేశించినట్లు ఒక ఫొటోతో చిత్రబృందం వెల్లడించింది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కేజీఎఫ్ -2 విడుదలకానుంది. చాప్టర్ 1లో యాష్ యాక్షన్‌ను ఓ రేంజ్‌లో చూపించటంతో -చాప్టర్ 2 కోసం కేజీఎఫ్ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, అల్ ది బెస్ట్ కేజీఎఫ్ యూనిట్!!