కాజల్ తో కాలక్షేపం..త్రివిక్రమ్ లో రసికత్వం

కాజల్ చేత స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారు

హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో స్పెషల్ డాన్స్ లు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. సినిమా అంతా చేసినా వచ్చే రెమ్యునేషన్ లో సగం అయినా ఈ సాంగ్ లలో గిట్టుబాటు అవుతూండటంతో ఇలా స్పెషల్ సాంగ్ అంటే సై అనేస్తున్నారు. పక్కా లోకల్ అంటూ జనతా గ్యారేజ్ లో ఊగిపోయి కుర్రాళ్లను ఊపేసిన కాజల్ మరోసారి అలాంటి స్టెప్ లలో అలరించటానికి సిద్దపడుతోంది. అయితే ఈ సారి అల్లు అర్జున్ తాజా చిత్రంలో అని తెలుస్తోంది. అయితే కాజల్ తో ఎందుకని అబ్జెక్షన్ పెట్టినా, కావాల్సిందే అని త్రివిక్రమ్ పట్టుబడ్డారట. ఈ పాట మాంచి శృంగార సమాసాలతో సాగుతుందని చెప్తున్నారు. త్రివిక్రమ్ దగ్గరుండి మరీ ఈ పాటని రాయిస్తున్నాడట.

అందుతున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న అల వైకుంఠపురములో చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేయటానికి కాజల్ ఒప్పుకుందని సమాచారం. ఈ మేరకు భారీ ఖర్చుతో అదిరిపోయే సెట్ ని హైదరాబాద్ లో వేస్తున్నారు. త్వరలోనే షూట్ ప్రాంభంకానుంది. ఈ మేరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ నిర్మాతల నుంచి రావాల్సి ఉంది.

వయస్సు పెరుగుతున్నా కాజల్ ఎక్కడా వెనకడగు వెయ్యకుండా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. రీసెంట్ గా సీత, రణరంగం చిత్రాలతో పలకరించిన ఆమె ఇండియన్ 2 చిత్రంలో లీడ్ చేస్తోంది. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రం సీక్వెల్ కమిటైంది. మరో రెండు తమిళ చిత్రాలు సైతం ఆమె చేస్తోందని వినికిడి.