కటౌట్ తొలిగింపు, అభిమానుల ఆందోళన

తమిళ స్టార్ సూర్య హీరోగా నటించిన ” ఎన్ జీకే ” ఈ రోజు భారీ ఎత్తున విడుదల అవుతున్న నేపథ్యంలో సూర్య అభిమానులు భారీ కటౌట్ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కటౌట్ ఎత్తు 215 అడుగులు కాగా దీనికి 7 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది . దాదాపు 35 రోజుల పాటు 40 మంది కార్మికులు కస్టపడి పనిచేస్తే ఈ కటౌట్ రూపొందింది.

తిరుత్తణిలో ఏర్పాటు చేసిన ఈ భారీ కటౌట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం ఈ కటౌట్‌ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ కూల్చేశారు. దీంతో ఆగ్రహించిన సూర్య అభిమానులు ఆందోళనకు దిగారు.

శుక్రవారం రిలీజ్ సందర్భంగా అభిమానుల ఏర్పాట్లలో ఉండగా గురువారం కటౌట్‌ తొలగించటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్జీకే సినిమాలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్‌ సింగ్‌లు హీరోయిన్లుగా నటించారు.