ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ పాన్ ఇండియా మూవీనా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ క‌లవ‌బోతున్నారు అంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు షిక‌రు చేస్తున్న విష‌యం తెలిసిందే. బుధ‌వారం ఈ చిత్రానిక సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్ మేక‌ర్స్ నుంచి రానే వ‌చ్చేసింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ వుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ సినిమా అంటే మ‌ళ్లీ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ అధినేత ఎస్‌. రాధాకృష్ణ నిర్మాత అని అంతా భావించారు. కానీ ఈ ప్రాజెక్ట్‌లోకి ఎన్టీఆర్ ఆర్ట్స్ క‌ల్యాణ్‌రామ్ ఎంట‌ర్ కావ‌డం షాకింగ్ న్యూసే.

రాధాకృష్ణ‌తో క‌లిసి క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా ఈ సినిమా తెర‌పైకి రాబోతోంది. ఈ వేస‌వికి షూటింగ్ మొద‌లుకానున్న ఈ చిత్రాన్ని 2021 వేస‌వికి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. డేట్ మిన‌హా సినిమా ఎప్పుడు రాబోతోందో ముందే ప్ర‌క‌టించేశారు. అంతా బాగానే వుంది.`అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రానికి బ‌న్నీ హీరోగా న‌టిస్తే నిర్మాత‌గా అల్లు అర‌వింద్ వ‌చ్చి చేరారు. సినిమాని ఎక్క‌డికో తీసుకెళ్లారు. అదే త‌ర‌హాలో ఎన్టీఆర్ 30 చిత్రానికి కూడా హారిక రాధాకృష్ణ‌తో క‌లిసి క‌ల్యాణ్‌రామ్ నిర్మించ‌డానికి ముందుకు రావ‌డంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అయితే `అర‌వింద స‌మేత‌`లా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్ చేస్తారా? అఏక అందులో ట‌చ్ చేసి చేయ‌న‌ట్టు వ‌దిలేసిన రాజ‌కీయ నేప‌థ్యంలో సినిమా వుంటుందా? అన్న‌ది మాత్రం ఇంకా తెలియాల్సి వుంది.