ఇద్ద‌రు క్రాక్‌లు త‌న‌తో ట‌చ్‌లో వున్నార‌ట‌!

Trisha

క‌రోనా వైర‌స్‌ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ని విధించిన విష‌యం తెలిసిందే. సామాన్యుల నుంచి స్టార్ వ‌ర‌కు ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. ఇంట్లో వుండి కాల‌క్షేపం చేయ‌డం మొద‌లుపెట్టారు. అయితే త్రిష మాత్రం త‌న‌తో ఇద్ద‌రు క్రాక్‌లు ట‌చ్‌లో వున్నార‌ని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించి షాకిచ్చింది. ఈ క్రూషియ‌ల్ పీరియ‌డ్‌లో త‌న‌కు రానా ద‌గ్గుబాటి, అల్లు అర్జున్ కంపెనీ ఇచ్చార‌ని త్రిష వెల్ల‌డించింది.

ఈ నేప‌థ్యంలో వీడియో కాల్స్ చేసుకున్నామ‌ని తెలుపుతూ స్క్రీన్ షాట్‌ల‌ని పోస్ట్ చేసింది. అలాగే తాను వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌తోనూ వీడియో కాల్ మాట్లాడాన‌ని ఆ స్క్రీన్ షాట్‌ల‌ని కూడా త‌న ఫాలోవ‌ర్స్‌తో పంచుకోవ‌డం ఆక‌ట్టుకుంటోంది. త్రిష ఇటీవ‌లే చిరు, కొర‌టాల క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్రం నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. కొన్ని బేధాభిప్రాయాల కార‌ణంగా చిరు సినిమా నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా త్రిష ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.