ఇంత‌కీ `ఫ్యామిలీ`ని షూట్ చేసింది ఎవ‌రు?

ఇంత‌కీ `ఫ్యామిలీ`ని షూట్ చేసింది ఎవ‌రు?

క‌రోనా మ‌హ‌మ్మారి ఎఫెక్ట్‌తో యావత్ దేశం మొత్తం లాక్ డౌన్‌ని విధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఎక్క‌డి వారు అక్క‌డే గ‌ప్ చుప్ అన్న‌ట్టుగా త‌యారైంది వాతావ‌ర‌ణం. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంతా లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. దీంతో సినిమాల‌తో పాటు అన్నీ స్థంభించి పోయాయి. సినీ కార్మికులు ప‌నిలేక అల్లాడిపోతున్నారు.

వారిని ఆదుకోవ‌డంలో భాగంగా సోనీ సంస్థ‌తో క‌లిసి క‌ల్యాణ్ జ్వువెల్ల‌ర్స్ `ఫ్యామిలీ` పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్‌ని రూపొందించింది. ప్ర‌సూన్ పాండే ఈ ల‌ఘు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి, మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి, ప్రియాంక చోప్రా, ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, దిల్జిత్ దొసాంజే, అలియాభ‌ట్‌, శివ‌రాజ్‌కుమార్ త‌దిత‌రులు న‌టించారు.

పేరుకు ప్ర‌సూన్ పాండే ద‌ర్శ‌కుడైనా అమితాబ్ వెర్ష‌న్‌ని అభిషేక్ బ‌చ్చ‌న్‌, ర‌జ‌నీ వెర్ష‌న్‌ని ఆయ‌న త‌న‌య సౌంద‌ర్య‌, ప్రియాంక వెర్ష‌న్‌ని ఆమె భ‌ర్త నిక్ జోన‌స్‌, ర‌ణ్‌బీర్‌, అలియా వెర్ష‌న్‌ల‌ని ఒక‌రి వెర్ష‌న్‌ని ఒక‌రు చిత్రీక‌రించారట‌. ఇందులో కొంత మందే న‌టించ‌డంతో మ‌రింత మది టాప్ స్టార్‌ల‌తో మ‌రో వెర్ష‌న్‌ని సిద్ధం చేస్తున్న‌ట్టు ద‌ర్శ‌కుడు ప్ర‌సూన్ పాండే వెల్ల‌డించారు.