ఆ స్టార్ హీరోలకు నైట్ పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్

ఎన్టీఆర్ మంచి పార్టీ ఇచ్చాడంటున్నారు ఇద్దరు

స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిగా ఎన్టీఆర్ ని చెప్తారు. అందుకే ఆయన చుట్టూ ఎప్పుడూ స్నేహవలయం ఉంటుంది. ఆ స్నేహితుల్లో చిన్న వాళ్ల నుంచి పెద్ద పెద్ద స్టార్స్ దాకా ఉంటారు. వాళ్లందరికీ తనదైన శైలిలో ఆతిధ్యం ఇస్తూంటారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఉన్నారు. ఈ క్రమంలో రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ లో ఉన్న ఇద్దరు స్టార్స్ తో డిన్నర్ చేసారు. ఇంతకీ ఎవరా స్టార్స్ అంటే..

ఆ స్టార్ హీరోలు మరెవరోకాదు సంజయ్ దత్, కెజీఎఫ్ హీరో యష్. వీళ్లిద్దరూ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ లో ఉన్నారు. వాళ్లతో తనకు ఉన్న పర్శనల్ పరిచయంతో ఇంటికి ఆహ్వానించాడు. వాళ్లతో పాటు కెజీ ఎఫ్ దర్శకుడు కూడా వచ్చినట్లు సమాచారం. సంజయ్ దత్ ఈ పార్టీలో ఫుల్ ఖుష్ అయ్యారు. ఎన్టీఆర్ హోస్టింగ్ స్క్రిల్స్ ని తెగ మెచ్చుకున్నారట. ప్రస్తుతం సంజయ్ దత్, యష్ ఇధ్దరూ కెజీఎఫ్ 2 షూటింగ్ లో ఉన్నారు.

RRR సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఈ సినిమా పూర్తికాగానే కెజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబోలో రానున్న సినిమా చర్చల దశలోనే ఉందని.. అన్నీ కుదిరితే 2020 చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని మైత్రి నిర్మాత ఒకరు అన్నారు.