అల్ల‌రి న‌రేష్‌ హీరోగా ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రం ‘నాంది’ డ‌బ్బింగ్ ప్రారంభం

 

అల్ల‌రి న‌రేష్‌ హీరోగా ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రం ‘నాంది’ డ‌బ్బింగ్ ప్రారంభం

 
అల్ల‌రి న‌రేష్‌ హీరోగా ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఇంటెన్స్ ఫిల్మ్ ‘నాంది’ డ‌బ్బింగ్ ప‌నులు రంజాన్ పర్వ‌దినం సంద‌ర్భంగా సోమ‌వారం మొద‌ల‌య్యాయి. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ‘ఎ న్యూ బిగినింగ్’ అనేది ఈ సినిమాకు ఉప‌శీర్షిక‌. 
 
సామాజిక అంశాల మేళ‌వింపుతో, క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రమిది. అల్ల‌రి న‌రేష్‌ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకుంటోంది. ఇది అల్ల‌రి న‌రేశ్ న‌టిస్తోన్న 57వ చిత్రం. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా కొన‌సాగే ఈ భిన్న త‌ర‌హా చిత్రానికి అబ్బూరి ర‌వి, చోటా కె. ప్ర‌సాద్‌, శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌, బ్ర‌హ్మ క‌డ‌లి వంటి ఉన్న‌త స్థాయి సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తున్నారు.