అంద‌రిది ఓ దారైతే వ‌ర్మ‌ది మ‌రోదారి!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా జ‌నం భ‌యంతో ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. దేశ వ్యాప్తంగా క‌రోనా క‌ట్ట‌డి కోసం లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఎక్క‌డి జ‌నం అక్క‌డే.. వీఐపీ లేదు, స్టార్ సెల‌బ్రిటీ లేదు..సామాన్యుడు లేదు. అంద‌రిదీ ఇదే ప‌రిస్థితి. క‌రోనా దృష్టిలో అంతా ఒక‌టే.. ఎవ్వ‌రైనా దాని దెబ్బ‌కు వ‌ణికిపోవాల్సిందే. ప్ర‌స్తుతం చిన్నా పెద్దా అని తేడా లేకుండా అంతా ఇంటి ప‌ట్టునే వుంటున్నారు. అత్య‌ధిక శాతం మంది కాల‌క్షేపం కోసం సినిమాలు చూస్తున్నారు.

ఇదిలా వుంటే అంద‌రిది ఓ దారైతే .. ఏదో సామెత చెప్పిన‌ట్టు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌ది మ‌రోదారి. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం పెరిగిన ద‌గ్గ‌రి నుంచి వ‌రుస ట్వీట్ల‌తో కాల‌క్షేపం చేస్తున్నాడు. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌పై వ‌ర్మ తీసిన చిత్రం `అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు`. ఇంటి పట్టునే వుంటున్న నారా చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్ ఇప్ప‌టికైనా త‌ను రూపొందించిన `అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు` చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో చూసి మీ విలువైన ఫీడ్ బ్యాక్‌ని అందించండి` అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. వ‌ర్మ ట్వీట్‌కి బ‌దులుగా ఓ నెటిజ‌న్ నువ్వుకూడా ఖాలీగానే ఇంట్లో కూర్చుంటున్నావు క‌దా నువ్వు తీసిని సినిమాల్ని కూడా చూసి రివ్యూ ఇవ్వు అని కామెంట్ చేశాడు.