టాలీవుడ్ ప్రస్తుతం ఎవ్వరి నోటా విన్న ఇదేమాట! తెలుగు చిత్రసీమలో తాజాగా టాప్ హీరోయిన్ రేస్ ఇద్దరి మధ్య జరుగుతోందిట. వారు ఎవరో కాదు.. ఒకరు పూజ హెగ్డే, మరొకరు రష్మిక. వీళ్ళిద్దరూ నెంబర్ వన్ స్లాట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు.
యువతరంలో విపరీతమైన క్రేజ్ ఉన్న రష్మిక మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ , నితిన్ తో ‘భీష్మ’ చిత్రాల విజయాలతో టాలీవుడ్ లో తన స్థానం సుస్థిరం చేసుకుంది. ఆమె తదుపరి చిత్రం కూడా యంగ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోతోనే చేస్తోంది. మొదట్లో కుర్ర హీరోలతో నటించినా కానీ ఇప్పుడు రష్మిక రేంజ్ వేరు. తదుపరి సినిమాలు చేస్తే చరణ్, తారక్, ప్రభాస్ లాంటి హీరోలతో చేస్తుంది.
ఒకవేళ మధ్య శ్రేణి హీరోలతో చేసినా కానీ సోలో హీరోయిన్ అయితేనే చేయడం ఖచ్చితం. టాప్ హీరోలు పోటీ పడినా డేట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉంది రష్మిక. అలాగే పూజాహెగ్డే కూడా తక్కువేం కాదు. టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ తెగ హల్ చల్ చేస్తోంది. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా వీరిలో ఎవరు నెంబర్ వన్? అని చర్చించుకుంటున్నారు!?

