ఉప్పల్ రోడ్డు ప్రమాదంలో బిటెక్ అమ్మాయి స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో బిటెక్ అమ్మాయి చనిపోయింది. బోడుప్పల్ కు చెందిన సత్యం కుమార్తె స్నేహ హోలీమేరి కాలేజిలో బిటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం తన స్నేహితురాలు శృతితో కలిసి ప్రాజెక్టు పని నిమిత్తం అమీర్ పేట వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి బోడుప్పల్ కు వస్తుండగా ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న స్కూటిని ఆర్టిసి బస్సు వెనుక నుంచి డికొట్టింది.

ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న స్నేహ ఎగిరి కిండపడడంతో ఆమె పై నుంచి బస్సు వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. శృతికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు   చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎదిగిన బిడ్డ చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు రోధించిన తీరు పలువురిని కన్నీరు పెట్టించింది. స్నేహ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య బంధువులని తెలుస్తోంది.