టిడిపి పార్టీకి చెందిన కార్యకర్తల డేటాను దొంగిలించాలరని, ఆ డేటా ఆధారం వైకాపా కాల్ సెంటర్ నుంచి టిడిపి కార్యకర్తలకు ఫోన్ లు వెళ్తుతున్నాయని, టిడిపి ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెశిడెంట్ కెటి రామారావు కి, ఆయనకు ట్విట్టర్ వార్ నడుస్తున్నది. ఆంధ్రలో ప్రజల వ్యక్తిగత డేటాను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం దొంగలించి ప్రయివేటు కంపెనీలు అప్పగించిందని టిఆర్ ఎస్ నేత కెటిఆర్ చెబుతున్నారు. లోకేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదులో కొన్ని కంపెనీల మీద కేసులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో అసలు డేటా చౌర్యం చేసింది టిఆర్ ఎస్, వైసిపిలేనని నారాలోకేష్ ఆరోపిస్తున్నారు. ఇలా చౌర్యం చేసిన డేటాలోని తెలుగుదేశం అభిమానులకు, కార్యకర్తలకు వైసిపి కాల్ సెంటర్ నుంచి ఫోన్ లు వెళ్తున్నాయని వాటి రికార్డు చేసి ఆయన ట్విట్టర్ లో పెట్టారు. ఇవి నారా లోకేష్ ట్వీట్స్..
కలువ కుంట కాల్ సెంటర్ @ హైదరాబాద్
ఫోన్ నెంబర్లు: 040 30075005 / 38134000హైదరాబాద్లో మా డేటా చోరీ చేశారు. ఇది నేరం కాదా?హైదరాబాద్లోనే దీనిని జగన్కు అందించారు. ఇది అప్రజాస్వామికంకాదా? pic.twitter.com/kPRQOmG6DL
— Lokesh Nara (@naralokesh) March 6, 2019
ఆంధ్రాను కే సీ ఆర్ కు తాకట్టు పెట్టేస్తావు అని జగన్ పై విరుచుకుపడ్డ ఒక సామాన్యుడు pic.twitter.com/D37X3U5ONl
— Telugu Desam Party (@JaiTDP) March 6, 2019
హైదరాబాద్ వైకాపా కాల్ సెంటర్ నుంచే APలోని టీడీపీ కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేసే కాల్స్ చేస్తున్నారు. ఇది చట్టాల ఉల్లంఘన కిందకు రాదా? ఇన్ని అక్రమాలు హైదరాబాద్లోనే జరుగుతున్నాయి.
— Lokesh Nara (@naralokesh) March 6, 2019
మరి దీని పై TS ప్రభుత్వం యాక్షన్ తీసుకోదా? జగన్, @ktrtrs జోడి అనడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా?
— Lokesh Nara (@naralokesh) March 6, 2019