అసలు దొంగిలించింది మా డేటానే…లోకేష్

టిడిపి పార్టీకి చెందిన కార్యకర్తల డేటాను దొంగిలించాలరని, ఆ డేటా ఆధారం వైకాపా కాల్ సెంటర్ నుంచి టిడిపి కార్యకర్తలకు ఫోన్ లు వెళ్తుతున్నాయని, టిడిపి ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు.  నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెశిడెంట్ కెటి రామారావు కి, ఆయనకు ట్విట్టర్ వార్ నడుస్తున్నది. ఆంధ్రలో ప్రజల వ్యక్తిగత డేటాను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం దొంగలించి ప్రయివేటు కంపెనీలు అప్పగించిందని టిఆర్ ఎస్ నేత కెటిఆర్ చెబుతున్నారు. లోకేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదులో కొన్ని కంపెనీల మీద కేసులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో అసలు డేటా చౌర్యం చేసింది టిఆర్ ఎస్, వైసిపిలేనని నారాలోకేష్ ఆరోపిస్తున్నారు. ఇలా చౌర్యం చేసిన డేటాలోని తెలుగుదేశం అభిమానులకు, కార్యకర్తలకు వైసిపి కాల్ సెంటర్ నుంచి ఫోన్ లు వెళ్తున్నాయని వాటి రికార్డు చేసి ఆయన ట్విట్టర్ లో పెట్టారు. ఇవి నారా లోకేష్ ట్వీట్స్..