పరాయి భార్యతో పోయిన వ్యక్తి జగ్గారెడ్డి : హరీష్ రావు

సంగారెడ్డి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై పరుషమైన పదజాలంతో విరుచుకుపడ్డారు టిఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు. సంగారెడ్డిలో శనివారం టిఆర్ఎస్ భారీ ర్యాలీ జరిపారు. సంగారెడ్డి జిల్లాలోని కంది నుంచి సంగారెడ్డికి వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. మంత్రి హరీశ్ రావుకు మహిళలు బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రంలో పలువురు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు తెరాసలో చేరారు. మంత్రి హరీశ్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీష్ రావు మాట్లాడారు. ఆయన ఏమన్నారో చదవండి.

జగ్గారెడ్డి మీద నిప్పులు చెరిగిన హరీష్ రావు

జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం వద్దని, తెలంగాణను బీదర్ లో కలపాలని మాట్లాడిండు. ఒకసారి ఆంధ్ర లో కలపాలని సోనియా గాంధీకి లేఖ రాసిన ద్రోహి జగ్గారెడ్డి. పరాయి వ్యక్తి భార్య తోను , పిల్లలతో అమెరికా వెళ్లి మానవ అక్రమ రవాణాకు పాల్పడిన దేశ ద్రోహి జగ్గారెడ్డి. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు జగ్గారెడ్డితో తిరిగేందుకు సిగ్గుపడుతున్నారు. కట్టుకున్న భార్యను..రక్తం పంచుకుపుట్టిన పిల్లల్ని మోసం చేసిన ఘనుడు జగ్గారెడ్డి. స్వాతంత్ర సమరయోధుల పేర్లతో అమీన్ పూర్ భూములను కాజేసిన దొంగ జగ్గారెడ్డి. మహిళ అయి ఉండి, మహిళల అక్రమ రవాణాకు పాల్పడిన జగ్గారెడ్డికి సునీత లక్ష్మారెడ్డి ఎలా మద్దతు ఇస్తారో చెప్పాలి. దేశ ద్రోహానికి పాల్పడిన జగ్గారెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి ఎలా సమర్థిస్తారు. మహిళలను, పిల్లలను అక్రమ రవాణా చేయడాన్ని జానారెడ్డి, ఉత్తమ్ లు సమర్థిస్తారా? నైతిక విలువలు‌ లేని జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎలా ఇస్తది. కిరాయి కోసం పరాయి మనుషులతో తిరిగిన వ్యక్తి జగ్గారెడ్డి కి తగిన గుణపాఠం చెప్పాలి.

రేపటి ఎన్నికలు తెలంగాణ సాధకులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరగబోతున్నాయి. నైతిక విలువలు లేని పార్టీ కాంగ్రెస్. చంద్రబాబు కనుసన్నల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నారు. మనుష్యుల అక్రమ రవాణాకు పాల్పడిన జగ్గారెడ్డి కి డిపాజిట్ దక్కోద్దు. తెలంగాణాకు అడ్డం పడిన చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఎలా పెట్టుకుంటుంది. తెలంగాణ ఉద్యమం అంతా స్వయం పాలన కోసం‌ జరిగితే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర నాయకత్వంలో  పని చేసేందుకు సిద్దపడుతున్నది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాస్తా, తెలుగుదేశం ప్రదేశ్  కాంగ్రెస్ కమిటీగా మారింది. మహాకూటమి తెలంగాణ ద్రోహులు, అభివృద్ధి నిరోధకుల కూటమిగా మారిపోయింది. వందేళ్ల చరిత్ర మాదని చెప్పుకునే కాంగ్రెస్ కు నైతిక విలువలు లేవు. 

సంగారెడ్డి లో చింతా ప్రభాకర్ ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు

సంగారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మచ్చలేని మనిషి. నాలుగేళ్ల లో ఎలాంటి వివాదాలు లేకుండా ప్రజల కోసమే పని చేశారు. చింతా ప్రభాకర్ గెలుపు ఖాయం. 73 వేల మెజారిటీతో గెలిపించాలి. జగ్గారెడ్డి కి డిపాజిట్ దక్కకుండా ఉండేలా పని చేయాలి. చింతా ప్రభాకర్ ను గెలిపించి సంగారెడ్డి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. సంగారెడ్డిని నాలుగేళ్ల లో ఎంతో అభివృద్ధి చేశాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సంగారెడ్డి అభివృద్ధిని పట్టించుకోలేదు. 15 కోట్లతో పాత సంగారెడ్డి వరకు నాలుగు వరుసల రోడ్ , బటర్ ఫ్లై లైట్స్, ఏర్పాటు చేశాము.  NH-65 NH-165 ను అభివృద్ధి చేస్తున్నాము. రీజనల్ రింగ్ రోడ్ సంగారెడ్డికి వరం కానుంది. చింతా ప్రభాకర్ కు కుడి భుజంగా ఉంటాను. సిద్దిపేట మాదిరే సంగారెడ్డిని అభివృద్ధి చేస్తానని మీకు మాట ఇస్తున్నాను.