ఇబ్రహీంపట్నం కాల్పుల ఘటన.. చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో మంగళవారం జరిగిన కాల్పులు తీవ్రంగా గాయపడిన రఘు అనే వ్యక్తి కూడా మృతి చెందాడు. మంగళవారం ఉదయం జరిగిన కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి  స్పాట్లోనే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన రాఘవేందర్ రెడ్డి ని హాస్పిటల్ కి తరలించగా ఆయన చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 5 స్పెషల్ టీం లతో నిందితుల కోసం గాలిస్తున్నారు.