టిఆర్ఎస్ ఎంపీలపై కాంగ్రెస్ రవళి రెడ్డి ఫైర్ (వీడియో)

టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో వ్యవహరించిన తీరు సిగ్గుచేటుగా ఉందని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి రెడ్డి. వరంగల్ లో ఆమె ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని కేటిఆర్ బొమ్మ అని అవమానకరంగా మాట్లాడుతున్నారని, ఈ వైఖరి సరికాదన్నారు. పార్లమెంటులో అవిశ్వాసంపై జరిగిన చర్చలో టిఆర్ఎస్ ఎంపీల తీరు తెలంగాణకు నష్టం కలిగించేలా ఉందన్నారు. మోడీ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని అన్నారు. ఇంకా ఘాటైన మాటలతో రవళి రెడ్డి టిఆర్ఎస్ ఎంపీలపై విరుచుకుపడ్డారు. ఆమె ఏమన్నారో కింద వీడియో ఉంది. చూడండి.