నడిరోడ్డు పై బాలుడు దారుణ హత్య… బీర్ బాటిల్ ముక్కలతో పొడిచి చంపిన వైనం?

ఇటీవల హైదరాబాద్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా రైలు డి కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..చందానగర్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హఫీజ్ పేట్, హైటెక్ సిటీ రైల్వే లైన్ మార్గంలో రైలు ఢీ కొట్టిన ఘటనలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన ఈ ముగ్గురు వ్యక్తులు మహబూబ్ నగర్ జిల్లా వాసులు రాజప్ప, కృష్ణ, శ్రీనులుగా గుర్తించారు. వీరు కూలి పని చేసుకుంటూ హఫీజ్ పేట్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఆ సమయంలో ఆ ప్రదేశంలో పట్టాలపై విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది మృతదేహాలను గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హుటహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన వ్యక్తులను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పోలీసులు పరిశీలించగా మరణించిన వారి వద్ద మద్యం సీసాలు లభించాయి. దీంతో మద్యం మత్తులో ఆ ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు రైలు కిందపడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.