ప్రజలకు గుడ్ న్యూస్..? త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించనున్న జియో..!

రాష్ట్రంలో 5జి సేవలను విస్తృతం చేయడానికి జియో సంస్థ సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4జి సేవలను అప్డేట్ చేసి 5జి నెట్వర్క్ ప్రజలకు అందించటానికి జియో సంస్థ ప్రణాళికలు రూపొందించింది. అక్టోబర్ 5వ తేదీ దసరా పండుగ రోజున ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, వారణాసి వంటి ప్రముఖ పట్టణాల్లో జియో సంస్థ 5జీ సేవలను ప్రారంభించింది. ఈ క్రమంలో ‘జియో వెల్కమ్ ఆఫర్’ పేరుతో వినియోగదారులకు 1జీబీపీఎస్ స్పీడుతో అన్ లిమిటెడ్ డాటా అందించనున్నట్లు జియో సంస్ధ ప్రకటించింది.

అంతేకాకుండా ఫైవ్ జి సేవలు పొందటానికి కస్టమర్లు సిమ్ కార్డ్ మొబైల్ మార్చాల్సిన అవసరం లేదని ఆటోమేటిక్గా 5జి సర్వీస్ అప్గ్రేడ్ అవుతుందని ఈ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం 42.5 కోట్ల కస్టమర్లతో 4జీ సేవలు అందించటంలో జియో సంస్థ మొదటి స్థానంలో ఉంది. అలాగే 5 జి సేవలను కూడా ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి అందుబాటులో ఉండేలా జియో సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి ప్రముఖ నగరాలతో పాటు ఇతర పట్టణాలలో కూడా 5జీ ప్రారంభించనున్నట్లు సంస్థ వెల్లడించింది. 5జీ సేవల ద్వారా దేశంలో హెల్త్ కేర్, స్కిల్ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ వంటి అనేక రంగాలు మరింత ప్రగతి సాధిస్తాయని జియో సంస్ధ చాలా నమ్మకంగా ఉంది. 4జీ సేవలను అందించటంలో ప్రథమ స్థానంలో ఉన్న జియో 5జీ వేగంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఊక్లా 5జీ డేటా స్పీడ్ గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం రిలయన్స్ జియో 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడింగ్ స్పీడ్ నమోదు చేసింది.