విడాకులు తీసుకొనున్న దీపికా పదుకొనె, రణ్ వీర్ సింగ్.. అసలేం జరిగిందంటే?

దీపికా పదుకొనె, రణ్ వీర్ సింగ్ బాలీవుడ్ స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి కొన్ని వాణిజ్య ప్రకటనలు చేయడం జరిగింది. ఇద్దరూ కలిసి కొన్ని సినిమాలలో కూడా నటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వీరి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది.

2012 నుంచి ఇద్దరు ఒకటై సహజీవనం కూడా మొదలుపెట్టారు. ఆరేళ్ల ప్రేమాయణం తర్వాత 2018లో వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు. సినీ కెరీర్ పరంగా ఇద్దరు బిజీగా రాణిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే ప్రముఖ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సందు ఇటీవలే వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని ట్విట్ చేశాడు.

ఈ వార్త సోషల్ మీడియాలో కొన్ని నిమిషాల వ్యవధులలోనే వైరల్ గా మారి వివిధ రకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక కొంతమంది నెటిజన్స్ అయితే విడాకులకు మరో ప్రేమ జంట రెడీ అయిందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారి వివిధ రకాల చర్చలకు దారితీస్తుంది.

కొందరైతే ఉమైర్ సుంధు చేసిన ట్వీట్ అసత్యమని కామెంట్ చేస్తున్నారు. తమపై వచ్చిన పుకార్లకు రణ్ వీర్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ఇటీవలే ముంబైలోని ఎఐసీసీఐ ఈవెంట్ లో పాల్గొన్న ఇతను దీపిక అంటే ఎంతో ఇష్టం, ఎంతో గౌరవం అని.. ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటానని చెప్పాడు. వ్యక్తిగతంగా తాను దీపిక నుంచి ఎంతో నేర్చుకున్నానని చెబుతూ మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది త్వరలోనే చెబుతానంటూ వచ్చిన పుకార్లకు చెక్ పెట్టేశాడు.

ప్రస్తుతం ఇతను రెండు చిత్రాల షూటింగ్లలో బిజీగా ఉండగా, అందులో రాకీ అవుర్ రాణికి ప్రేమ్ కహాని సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. విడుదల కోసం మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసుకునే దశలో ఉంది. ఇక రెండవ చిత్రం సర్కస్ షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. మరొకవైపు దీపిక కూడా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈమె నటించిన పఠాన్ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ తో ప్రాజెక్ట్-కే చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.