అల్లు అర్జున్ సరసన సాయి పల్లవి.. ఇంతకు ఏ సినిమానో తెలుసా?

సాయి పల్లవి తెలుగు సినీ నటిగా అందరికీ సుపరిచితమే. ఈమె తెలుగు, తమిళ, మలయాళ భాషలలో నటిస్తుంది. 2008లో తమిళంలో ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొనడం జరిగింది. 2009 ఈటీవీలో అల్టిమేట్ డాన్స్ షోలో ఫైనలిస్టుగా నిలిచింది. 2005లో విడుదలైన కస్తూరి మాన్ అనే తమిళ సినిమాలో బాలనటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

2015లో విడుదలైన మలయాళ చిత్రం ప్రేమమ్ సినిమాలో హీరోయిన్ గా నటించి మలయాళ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఇక తెలుగులో 2017 లో విడుదలైన ఫిదా సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయం అయింది. తెలుగులో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, విరాటపర్వం చిత్రాలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ఇక తమిళంలో నటించిన మారి 2 చిత్రం తెలుగులో రావడం జరిగింది. ఈ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా వరుస అవకాశాలతో తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది.

అసలు విషయం ఏమిటంటే పుష్ప 2 లో హీరోయిన్ పాత్రలో సాయి పల్లవి నటించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. పుష్ప 2 చిత్రబృందం సాయి పల్లవి ని కలవడం జరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ సాయి పల్లవికి కథ చెప్పడం జరిగిందని వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పుష్ప 2 లో సాయి పల్లవి ఒక గిరిజన అమ్మాయిలాగా కనబడబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు ఈ సినిమాలో అల్లు అర్జున్ తో సాయి పల్లవి రొమాన్స్ చేస్తూ ఉంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప 2 లో హీరోయిన్ సాయి పల్లవి అని అధికారకంగా ప్రకటించలేదు.అసలు విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం సాయి పల్లవి ఒక తమిళ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు సమాచారం.