ఎన్టీఆర్, చెర్రీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మ‌ధ్యాహ్నాం ఆర్ఆర్ఆర్ నుండి రానున్న అదిరిపోయే అప్‌డేట్

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాల‌లో ఆర్ఆర్ఆర్ ఒక‌టి. జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజమౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేసే ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో క్లైమాక్స్‌కు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతుండ‌గా, దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్. అత్యంత పరాక్రమశాలి భీం, ఉగ్రరూపుడైన రామరాజు తమ ఉమ్మడి లక్ష్య సాధనకు సంసిద్ధులవుతున్నారు అని అన్నారు.

బాహుబ‌లి సినిమా త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఆ మ‌ధ్య ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌కు సంబంధించి వీడియోలు విడుద‌ల చేసిన రాజ‌మౌళి రానున్న రోజుల‌లో మ‌రిన్ని అప్‌డేట్స్ వ‌స్తాయ‌ని అన్నాడు. ఇందులో భాగంగా ఈ రోజు మ‌ధ్యాహ్నాం రెండు గంట‌ల‌కు బిగ్ అనౌన్స్‌మెంట్ ప్ర‌క‌టించ‌నున్నాడు. ఫిలిం న‌గ‌ర్ స‌మాచారం ప్ర‌కారం టీజ‌ర్ లేదా ఫ‌స్ట్ లుక్ టైంని అనౌన్స్ చేస్తార‌ని టాక్. ఏది వ‌చ్చిన కూడా అభిమానులకు పండుగే అని చెప్పాలి.

క‌రోనా లేక‌పోయి ఉండిఉంటే ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లై ఉండేది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2020 జులై 30న సినిమాను విడుదల చేస్తాం అని మొద‌ట‌ అనౌన్స్ చేశాడు రాజమౌళి. కానీ అనివార్య కార‌ణాల వ‌ల‌న 2021 జనవరి 8కి దాన్ని పోస్ట్ పోన్ చేశాడు. కరోనా వైరస్ కారణంగా ద‌స‌రాకు వాయిదా ప‌డింది. అలియా భ‌ట్‌, ఒలివీయా మోరిస్, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, శ్రియ వంటి స్టార్స్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని మ‌రింత పెంచుతుంద‌ని అంటున్నారు. దాదాపు 400 కోట్లతో నిర్మిస్తున్నాడు డి.వి.వి.దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.