139 మంది 10 ఏళ్ల పాటు 5000 సార్లు అత్యాచారం చేశారు.. రేపిస్ట్ లిస్ట్‌లో మాజీ ఎంపీ.. నిర్మాత‌లు టీవీ హోస్ట్ కూడా..! వేడెక్కిస్తున్న నిర్భ‌య కేసు!!

అందాల‌ వ‌ల‌: నిర్మాత‌ల్ని ముగ్గులోకి లాగుతున్న నెర‌జాన‌!

139 మంది 10 ఏళ్ల పాటు 5000 సార్లు అత్యాచారం చేశారు.. రేపిస్ట్ లిస్ట్‌లో మాజీ ఎంపీ.. నిర్మాత‌లు టీవీ హోస్ట్ కూడా..! వేడెక్కిస్తున్న నిర్భ‌య కేసు!!  పూర్తి వివ‌రాలు షాకిస్తున్నాయి.

woman filed case on 139 rapists
woman filed case on 139 rapists

త‌న‌పై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ మ‌హిళ పంజాగుట్ట పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం ఇటీవ‌ల సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కేసు నమోదైంది. ఆ జాబితాలో ప్రముఖ తెలుగు టీవీ హోస్ట్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది.

139 మంది టాప్ గ‌న్స్ ఈ అత్యాచారం కేసులో బుక్క‌య్యార‌న్న‌ది తాజా స‌మాచారం. ఇప్ప‌టికే వీళ్లంద‌రిపైనా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశార‌ని తెలిసింది. వీళ్లంతా తనపై 5000 సార్లు అత్యాచారం జరిగిందని ఆమె ఫిర్యాదులో నమోదు చేసింది. 25 ఏళ్ల యువ‌తి నల్గొండ జిల్లా మిర్యాలగుడకు చెందినది. గత పదేళ్ల నుంచి తాను అత్యాచారానికి గురయ్యానని ఆమె పోలీసుల‌కు తెలిపింది.

ఇదంతా విని షాక్ అయిన పంజాగుట్ట పోలీసులు ఆమె ఆరోపణలు వాదనల ప్రకారం 113 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ జాబితాలో పాపులర్ తెలుగు యాంకర్ స‌హా చాలా మంది సినీ నిర్మాతలు, ఒక కెమెరామెన్, ఒక ప్రసిద్ధ టీవీ ఛానల్ రిపోర్టర్, మాజీ ఎంపి అతని పిఎ, ఒక వైద్యుడు మరియు చాలా మంది ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ఉన్నారు.

పోలీసుల నివేదికలో పేర్కొన్న పేర్లతో పాటు అనేక ఇతర విభాగాలపై నిర్భయ కేసు నమోదు చేసి, దానిపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే అదే యాంకర్ పేరును ఉపయోగించి ఇలాంటి ఆరోప‌ణ‌ల కేసులో పేరు తెచ్చుకోవాల‌ని భావించేవాళ్లు.. లేదా కేసును చెత్త‌బుట్ట‌లో వేసేవాళ్లు కూడా ఉన్నారు. అయితే ప్ర‌స్తుతానికి పోలీసులు దీనిని సీరియ‌స్ గానే తీసుకున్నార‌ని తెలుస్తోంది. నిర్భ‌య కేసు కాబ‌ట్టి అంత తేలిగ్గా స‌ద‌రు సెల‌బ్రిటీల్ని వ‌ద‌ల‌క‌పోవ‌చ్చ‌నే భావిస్తున్నారు.