Samantha: సమంత-చైతన్య మళ్లీ కలవనున్నారా.. అనుమానాలు రేకెత్తిస్తున్న సమంత పోస్ట్!

Samantha: 2021 సంవత్సరం సమంత ,నాగ చైతన్య ల విడాకుల విషయం టాలీవుడ్ ఇండస్ట్రీ ని షాక్ కి గురిచేసింది. 10 సంవత్సరాలు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచే వారు. కానీ వారి మధ్య వ్యక్తిగత మనస్పర్థల వల్ల గతేడాది వీరిద్దరు మనస్ఫూర్తిగా ఒకరికొకరు దూరంగా ఉండటానికి విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

మొదట సమంత తన ఇన్స్టాగ్రామ్ లో ఇంటి పేరును తొలగించటం వల్ల అందరికీ అనుమానం వచ్చింది. కొన్ని రోజుల తర్వాత సమంత-నాగచైతన్య ఇద్దరు సోషల్ మీడియా వేదికగా వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. సమంత ఆ బాధ నుండి బయట పడటానికి నిత్యం వర్క్ తో బిజీగా ఉంటూ, విహార యాత్రలకు, పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ తన బాధను మర్చిపోవటానికి ప్రయత్నించింది.ఇప్పుడిప్పుడే వారిద్దరూ తమ పనిలో బిజీగా ఉంటూ ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. కానీ తాజాగా సమంతా చేసిన ఒక పని వల్ల మళ్లీ అందరిలో అనుమానం కలుగుతోంది. తాజాగా నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇటీవల సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి విడాకులు పోస్ట్ ను డిలీట్ చేయడం వల్ల అందరిలో వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారు అనే అనుమానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికీ వీరిద్దరూ కలవాలని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. కానీ సమంత విడాకుల ప్రకటన డిలీట్ చేసినప్పటికీ నాగచైతన్య మాత్రం ఆ పని చేయలేదు. అందువల్ల వీరిద్దరూ కలిసే ప్రసక్తి లేదు, ఒకవేళ వీరిద్దరూ కలవాలి అనుకుంటే చైతన్య కూడా ఆ పోస్ట్ డిలీట్ చేసేవాడు. అందువల్ల సమంత విడాకుల ప్రకటన ఏదో పొరపాటు డిలీట్ చేసిందేమో అని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద, కాత్తువాక్కుల రెండు కాదల్, సినిమాలతో పాటు హాలీవుడ్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.