Anantapur: పెళ్లయిన నెలకే భర్తను విడిచి పుట్టింటికి వెళ్ళిన భార్య… మనస్థాపంతో అంత పని చేసిన భర్త!

Anantapur: వివాహం అనేది అమ్మాయి అబ్బాయి జీవితంలో ఎంతో ముఖ్యమైన వేడుక.వివాహం తర్వాత వారిద్దరు పదికాలాల పాటు ఆనందంగా జీవితం కొనసాగించాలి అంటే వారి ఇష్ట ప్రకారమే వివాహం చేయాలని పెద్దలు చెబుతుంటారు. కానీ కొంతమంది మాత్రం అమ్మాయి అబ్బాయి ఇష్టాఇష్టాలను కాదని వారు చెప్పిన సంబంధాన్ని చేసుకోవాలని నిబంధనలు పెట్టడంతో ఎంతో మంది జీవితాలు మధ్యలోనే ముగుస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన అనంతపురం జిల్లాలో ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే…

అనంతపురం జిల్లాకు చెందిన భాస్కర్ అనే యువకుడికి గత రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహమైన నెలరోజులకి భార్య తనని వదిలి పుట్టింటికి వెళ్ళింది. అప్పటినుంచి భాస్కర్ తన భార్య కోసం ఎన్నిసార్లు అత్తవారింటికి వెళ్ళిన తను మాత్రం ఇంటికి రాలేదు. అదే విధంగా తన భార్యని కాపురానికి రమ్మని కబురు పంపించిన తన భార్య రాకపోవడంతో ఎంతో మనస్థాపం చెందిన భాస్కర్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ విషయాన్ని గమనించిన భాస్కర్ తల్లిదండ్రులు వెంటనే తన కొడుకు ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే భాస్కర్ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.