హీరోలూ.. ఎందుకయ్యా రిస్క్ చేస్తున్నారు ?

కరోనా దెబ్బకు జనం విలవిలలాడిపోతున్నారు. రోజూ లక్షల్లో కేసులు వస్తున్నాయి. ప్రపంచంలోనే ఒక రోజులో అత్యధికంగా కేసులు వచ్చిన దేశంగా ఇండియా నిలిచింది. సాంహ్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా అందరినీ కరోనా కాటేస్తోంది.

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పలువురు కరోనాకు బలయ్యారు. సినిమా షూటింగ్ పెడితే కేసులు ఖాయం అన్నట్టే ఉంది పరిస్థితి. అందుకే చాలామంది షూటింగ్స్ నిలిపివేశారు. కానీ కొందరు హీరోలు మాత్రం ధైర్యం చేసి షూటింగ్ చేస్తున్నారు. నిజానికి ఈ ధైర్యం ఇప్పుడు చూపాల్సిన అవసరం లేదు.

అన్ని సినిమాలు ఆగిపోయినా ‘పుష్ప, రాధేశ్యామ్, థాంక్యూ’ షూటింగ్స్ జరుగుతూ వచ్చాయి. ప్రభాస్ బృందంలో ఒకరికి పాజిటివ్ రావడంతో షూటింగ్ ఆపేశారు. అలాగే అల్లు అర్జున్, ‘పుష్ప’ బృందంలోని కొందరు వైరస్ బారిన పడటంతో ‘పుష్ప’ నిలిచిపోయింది. అసలు అందరితో పాటే వీరంతా షూటింగ్స్ ఆపేసి ఉంటే వైరస్ సోకేదే కాదు. ఇక నాగ చైతన్య ‘థాంక్యూ’ అయితే ఇటలీలో జరుగుతోంది. ఇప్పుడు అది కూడ అయిపోయింది.

ఎందుకంటే ఇండియా నుండి వచ్చే వారికి ఇటలీలోకి ప్రవేశం లేదు. దీంతో చేసేది లేక ఆపేశారు. అయినా లైఫ్ రిస్క్ చేసి షూటింగ్స్ చేసినా రిలీజ్ చేసే వెసులుబాటు లేదు. అయ్యే ఆలస్యం ఎలాగూ అవుతోంది. అలాంటప్పుడు కొందరు హీరోలు ఎందుకని రిస్క్ తీసుకుంటున్నారో మరి.