అల్లు బ్రదర్స్ కి ఏమైంది?

మెగా ఫామిలీ బ్రాండ్ తో కొన్నాళ్ళు నెట్టుకొచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత మాత్రం తనకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. ‘పుష్ప’ లాంటి బ్లాక్బస్టర్ తో పాన్ ఇండియా హీరో గా మారిపోయాడు. అయితే తాను పెద్ద సూపర్ స్టార్ అయినా కానీ తన తమ్ముడు శిరీష్ మాత్రం కనీసం మీడియం రేంజ్ హీరో కూడా కాలేకపోయాడు.

గత కొంత కాలం గా శిరీష్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అలాగే అను ఇమ్మానుయేల్ తో ప్రేమలో ఉన్నాడని కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. సోష‌ల్ మీడియాలో శిరీష్ బాగా యాక్టివ్‌గా ఉండే  శిరీష్‌ గత కొంతకాలంగా ఎందుకో గాని సైలెంట్ గా ఉంటున్నాడు. దీని వెనక చాలా కారణాలే ఉన్నాయన్న గుసగుసలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

అల్లు శిరీష్ తన తండ్రి అల్లు అరవింద్ పైన అలిగాడని అందుకే ఇప్పుడు ముంబై లో ఉంటున్నాడని తెలుస్తుంది. తన అన్న కెరీర్ మీద పెట్టిన ఫోకస్ తన మీద పెట్టలేదని అందుకే తండ్రి కి దూరంగా ఉంటున్నాడు తెలుస్తుంది.

ఇన్నాళ్లు అల్లు అర్జున్ సోష‌ల్ మీడియా వ్య‌వ‌హారాలు అన్ని చూసుకునే శిరీష్ ఇప్పుడు వాటిని కూడా వ‌దిలేశాడ‌నే అంటున్నారు. అయితే ఇప్పటి వరకు వీటి పై అల్లు అర్జున్ కానీ, శిరీష్ కానీ స్పందించలేదు.