విరసం నేత.. వరవరరావుకు కరోనా..!

Varavara Rao

విరసం నేత వరవరరావుకు కరోనా వైరస్ పాజిటివ‌గా తేలింది. బీమా కోరేగావ్ కేసులో వరవరరావును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ముంబయి తలోజా జైల్లో ఉన్న వరవరరావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పలు విజ్ఞప్తుల అనంతరం ఆయన్ను ఎట్టకేలకు ముంబై ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. అయితే జేజే ఆస్పత్రిలో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ నేపధ్యంలో వరవరరావును సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు.