Garikapati Narasimha Rao : షాకింగ్ : “పుష్ప” సినిమాపై గరికపాటి సంచలన కామెంట్స్ వైరల్..!

Garikapati Narasimha Rao :  రీసెంట్ గా ఇండియన్ సినిమా దగ్గర వచ్చి సాలీడ్ హిట్ అయ్యిన చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా “పుష్ప ది రైజ్”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి చాలా రోజులే అయ్యింది. మరి ఇదిలా ఉండగా ఇప్పటికీ కూడా పుష్ప తాలూకా ఇంపాక్ట్ ఆడియెన్స్ లో కనిపిస్తుంది.

అయితే ఈ సినిమా పెద్దగా కాంట్రవర్సీ లలో ఇరుక్కున్నది లేదు కానీ సినిమా రిలీజ్ టైం లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే ఈ సినిమా నేపథ్యానికి సంబంధించి గాని అల్లు అర్జున్ పాత్రకి సంబంధించి కానీ ఎవరు కూడా ఎప్పుడు అభ్యంతరం చేసిన సందర్భాలు ఇప్పటివరకు చోటు చేసుకోలేదు.

కానీ తాజాగా తెలుగు వారైనా ప్రవచన కర్త పద్మభూషణ్ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు పుష్ప సినిమాపై చేసిన సంచలన కామెంట్స్ పెద్ద ఎత్తున అభిమానుల్లో దుమారం లేపుతున్నాయి. పుష్ప లాంటి సినిమా ఏమిటని? అందులో ఒక స్మగ్లర్ ని హీరోగా చూపించడం మళ్ళీ వాడు తగ్గేదేలే అంటూ చెప్పడం అందరి మీద ప్రభావం చూపిస్తుందని.

యువత ఈ స్మగ్లింగ్ లోకి దిగితే? ఇలాంటి సినిమాలు తీస్తారా, సినిమా తీసిన దర్శకుడు సుకుమార్ కానీ నటించిన హీరో అల్లు అర్జున్ కానీ నాకు కనిపిస్తే ఏ తరహా సినిమాలు మీరు తీస్తున్నారు ఒక స్మగ్లింగ్ చేసే వాడిని హీరోలా చూపిస్తారా అని కడిగేస్తానని పలు సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. దీనితో అల్లు అర్జున్ అభిమానులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.