విజయ్ ఆంటోనీ క్రైమ్ డ్రామా “దోషి” ఫస్ట్ లుక్ విడుదల

విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న సినిమా “దోషి”. మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్య నంబీసన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, జి ధనుంజయన్, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. సీఎస్ అముదన్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న దోషి సినిమా ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు.

ఇప్పటిదాకా మానవాళి చరిత్రలో జరగని క్రైమ్ డ్రామా కథగా ఈ సినిమా ఉండనుంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. తమీజ్ పాడమ్ లాంటి హిలేరియస్ స్పూఫ్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు సీఎస్ అముదన్ ఈసారి క్రైమ్ డ్రామా జానర్ లో దోషి చిత్రాన్ని తెరకెక్కించారు.

జగన్, నిళల్ గల్ రవి, జాన్ మహేంద్రన్, కలై రాణి, మహేష్, ఓక్ సుందర్, మీషా ఘోషాల్, అమేయా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – కన్నన్, సినిమాటోగ్రఫీ – గోపీ అమర్నాథ్, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాణం – ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్, నిర్మాతలు – కమల్ బోరా, జి ధనుంజయన్, బి ప్రదీప్, పంకజ్ బోరా , రచన, దర్శకత్వం – సీఎస్ అముదన్.