మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ‘ఉప్పెన’తోనే స్టార్ ఇమేజ్ తెచ్చేసుకున్నాడు. ఏ హీరోకి దొరకని గొప్ప లాంచ్ అందుకున్నాడు. ఒక్కసారిగా వచ్చిన ఈ క్రేజ్ అతని కెరీర్ నే మలుపు తిప్పేసింది. ప్రస్తుతం పెద్ద నిర్మాణ సంస్థలు మూడు అతనితో సినిమాలు సైన్ చేసుకున్నాయి. అందరి కొత్త హీరోల్లా వైష్ణవ్ తేజ్ దొరకడం అంత ఈజీ కాదు. అతని సినిమాలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ‘ఉప్పెన’ విడుదలకావడానికంటే ముందే తేజ్ దర్శకుడు క్రిష్ నిర్మాణంలో ఒక సినిమా చేశాడు. అందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక.
క్రిష్ సినిమా పూర్తయ్యాకనే ‘ఉప్పెన’ విడుదలకావడం, పెద్ద హిట్టవ్వడం జరిగిపోయాయి. దీంతో క్రిష్ సినిమా మీద ఒత్తిడి మొదలైంది. సినిమా ‘ఉప్పెన’ స్థాయిలో హిట్టయ్యేలా ఉండాలని అందరూ ఆశిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు సైతం హక్కులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇక ఓటీటీ సంస్థలైతే హక్కుల్ని దక్కించుకోవడం కోసం శతవిధాలా ట్రై చేస్తున్నాయి. కానీ అదంతా ఈజీ కాదు.
వైష్ణవ్ తేజ్ సినిమా అంటే జనంలో ఇప్పుడొక క్రేజ్, హైప్ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తేజ్ సినిమా ఓటీటీలో వస్తే అతని కెరీర్ కు, సంపాదించుకున్న క్రేజ్ కు కొంత నష్టమే. అందుకే క్రిష్ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లలోనే వదలాలని డిసైడ్ అయ్యారట. ఎంత ఆలస్యమైనా సెకండ్ వేవ్ తగ్గి పరిస్థితులు చక్కబడ్డాకనే సినిమా థియేట్రికల్ రిలీజ్ ఉంటుందట.