మెగా హీరోకు అక్కినేని ఫ్యామిలీ స‌పోర్ట్‌.. ఇక ర‌చ్చ రంబోలానే అంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీతో పాటు అక్కినేని ఫ్యామిలీలు ఎంతో ప్ర‌త్యేక‌మో మ‌నంద‌రికి తెలిసిందే. రెండు ఫ్యామిలీల నుండి చాలా మంది తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాగా, వారు వినూత్న క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. అయితే ఈ రెండు ఫ్యామిలీ హీరోలు క‌లిసి సినిమా చేస్తే బాగుంటుంద‌ని ఇరువురు హీరోల ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ న‌డుస్తున్న నేప‌థ్యంలో మెగా, అక్కినేని హీరోలు క‌లిసి ఓ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మెగా, అక్కినేని మ‌ల్టీ స్టార‌ర్ అయితే ఇప్ప‌ట్లో ఊహించ‌లేం కాని అక్కినేని వారి నిర్మాణంలో మెగా హీరో సినిమా ఒక‌టి రూపొందుతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఉప్పెన సినిమాతో మంచి హిట్ కొట్టిన వైష్ణ‌వ్ తేజ్ రెండో సినిమాగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేశాడు. ఇది రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక మూడో సినిమా ఎవ‌రితో చేస్తాడ‌ని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో డెబ్యూ డైరెక్ట‌ర్‌కు వైష్ణ‌వ్ ఛాన్స్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమా ను అక్కినేని నాగార్జున మనం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నిర్మించబోతున్నట్లుగా మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే వైష్ణవ్ తేజ్ కోసం నాగ్ కథను కూడా సిద్దం చేయించాడట.

వైష్ణ‌వ్ తేజ్ త‌న మూడవ సినిమాగా బోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో చేయాల్సి ఉన్నా అంతకంటే ముందు మనం ఎంటర్ టైన్ మెంట్స్ లో నాగార్జున నిర్మించే సినిమాను మొదలు పెట్టాల‌ని వైష్ణ‌వ్ అనుకుంటున్నాడ‌. డెబ్యూ ద‌ర్శ‌కుడు చెప్పిన స్టోరీ చాలా బాగా న‌చ్చి ఈ సినిమానే తొలుత సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని భావిస్తున్నాడ‌ట‌. వీటిపై అతి త్వ‌ర‌లోనే పూర్తి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.